ఐటీడీఏలో సోమవారం ‘గిరిజనదర్బార్’ రద్దు : పీఓ
✍️ భద్రాచలం – దివిటీ (సెప్టెంబరు 14)
భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఈ నెల 16వ తేదీన (సోమవారం) నిర్వహించాల్సిన గిరిజనదర్బార్ రద్దు చేసినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవార ‘మిలాద్ ఉన్ నబి (పండుగ)’ ఉన్నందున ఐటీడీఏలోని యూనిట్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం వల్ల గిరిజన దర్బార్ రద్దు చేసినట్లు వివరించారు. ఈ విషయాన్ని గమనించి గిరిజనులు అర్జీలు ఇచ్చేందుకు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయానికి రావద్దని ఆయన తెలిపారు.