ప్రగతి విద్యానికేతన్ లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు
✍🏽 దివిటీ – బూర్గంపాడు (23 డిసెంబర్)
దేవుని కుమారునిగా భక్తులు భావించే ఏసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారని ప్రగతి విద్యానికేతన్ కరస్పాండెంట్ సానికొమ్ము బ్రహ్మారెడ్డి చెప్పారు. సారపాకలోని ప్రగతి విద్యానికేతన్ లో శనివారం క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో భాగంగా ఆయన కేక్ కట్ చేసి, మాట్లాడారు. ప్రపంచంలో అన్ని దేశాలు డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు కేక్, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.