విద్యార్థులు ‘ఎ’, ‘బి’ గ్రేడ్స్ సాధించేలా కృషి చేయాలి
ప్రధానోపాధ్యాయులతో ఐటీడీఏ పీఓ జూమ్ మీటింగ్
చర్చనీయాంశంగా ‘దివిటీ మీడియా’ స్పెషల్ స్టోరీ
✍🏽 కె.ఎన్.ఆర్ – దివిటీ మీడియా
ఆశ్రమ పాఠశాలల్లో 10వ తరగతిలో ఉన్న విద్యార్థులందరూ ‘ఎ’, ‘బి’ గ్రేడ్స్ సాధించేలా కృషి చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ‘సి’, ‘డి’ గ్రేడ్స్ లోని విద్యార్థుల సామర్ధ్యాలు మెరుగుపడేరీతిలో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో దిగజారుతున్న పరిస్థితుల గురించి ‘దివిటీ మీడియా’లో బుధవారం ప్రచురితమైన స్పెషల్ స్టోరీ చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు బుధవారం(నవంబరు 15) పీఓ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగులో మాట్లాడుతూ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషిచేయాలని ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఖమ్మం, భద్రాచలం డిప్యూటీ డైరెక్టర్ పి.మణెమ్మ, ఏటీడబ్ల్యుఓలు, ఏసీఎం, పీఎంఆర్సీ కూడా పాల్గొన్నారు.
