Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StylePoliticsTelangana

ఎన్నికలు ముగిసేవరకు ‘ప్రజావాణి’ కార్యక్రమం రద్దు : కలెక్టర్

ఎన్నికలు ముగిసేవరకు ‘ప్రజావాణి’ కార్యక్రమం రద్దు : కలెక్టర్

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

ప్రజాసమస్యలపై దరఖాస్తులు, ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించేందుకు వారం వారం సోమవారం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమం అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు రద్దు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా ప్రియాంకఅల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల(అక్టోబరు) 30వ తేదీ సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా రద్దుచేసినట్లు ఆమె తెలిపారు. జిల్లా అధికారయంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమైనందున ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తునట్లు తెలిపారు. ఎన్నికలప్రవర్తనా నియమావళి ముగిసేంత వరకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయం గుర్తించి ఫిర్యాదులు అందజేసేందుకు కలెక్టరేట్ కు రావద్దని ఆమె పేర్కొన్నారు.

Related posts

జిల్లా పోలీస్ కేంద్రంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

Divitimedia

నవంబరు 10న ఉమ్మడి జిల్లా పాఠశాలల బాక్సింగ్, సాఫ్ట్ బాల్ ఎంపికలు

Divitimedia

ఇకనుంచి ఆన్‌లైన్‌లోనే సీఎంఆర్ఎఫ్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

Divitimedia

Leave a Comment