Divitimedia
Andhra PradeshBhadradri KothagudemCrime NewsMuluguSpot NewsTelangana

భద్రాచలంలో అంతర్రాష్ట్ర సరిహద్దు అధికారుల సమావేశం

భద్రాచలంలో అంతర్రాష్ట్ర సరిహద్దు అధికారుల సమావేశం

✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్ సూచనలతో భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో ఏఎస్పీ కార్యాలయం లో మంగళవారం (సెప్టెంబర్ 5) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల పోలీసు అధికారులు, మూడు రాష్ట్రాల సీఆర్పీఎఫ్ అధికారులతో అంతర్రాష్ట్ర సరిహద్దు సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచి, ఆ సమాచారాన్ని వెంటనే పరస్పర సమన్వయం చేసుకోవడం ద్వారా అధికారులు తీసుకునే చర్యలతోనే మావోయిస్టులను కట్టడి చేయడం సులభ తరమవుతుందని ఈ సందర్భంగా ఏఎస్పీ తెలియజేశారు. త్వరలో జరుగబోతున్న ఎన్నికల్లో తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు చర్చించారు. ఈ సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్, మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు, ఛత్తీస్ గఢ్ డీఎస్పీలు శంకర్రావు, శేఖర్ మడవి, సీఆర్పీఎఫ్ కమాండెంట్ అయోధ్య సిన్హా, ప్రీతి, అజయ్ ప్రతాప్ సింగ్, పీయూష్ తివారి, పామేడు సీఐ ప్రదీప్, మారాయి గూడెం సీఐ రాజేంద్ర దివాన్, ఊసూర్ సీఐ వినోద్ ఎక్క, ఎలిమిడి సీఐ ప్రధాన్, ఎటపాక సీఐ గజేంద్ర కుమార్, ఎస్సై పార్థ సారథి, భద్రాచలం సబ్ డివిజన్ పోలీస్ సిఐలు రాజగోపాల్, రమేష్, నాగరాజురెడ్డి, ఎస్సైలు మధు ప్రసాద్, కేశవరావు, గణేష్, పీవీఎన్ రావు, విజయలక్ష్మి పాల్గొన్నారు.

Related posts

విలువిద్య పోటీల్లో జాతీయస్థాయికి ఎంపికైన మమత

Divitimedia

రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి

Divitimedia

టీడీపీలో ముసలం, రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా

Divitimedia

Leave a Comment