ఆయన నిజాయితీ అందరికీ స్ఫూర్తి….
రివార్డుతో సత్కరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
✍️ మణుగూరు, హైదరాబాద్ – దివిటీ (జూన్ 5)
ఓ సాధారణ ఆర్టీసీ డ్రైవర్ అసాధారణమైన మంచి పని చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు… ఆయన చేసిన పనికి మెచ్చిన తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రివార్డు అందజేసి మరీ సత్కరించారు… స్పూర్తిదాయకమైన ఆ వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ మహేష్ మే 28న అమలాపురం డ్యూటీకి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆ బస్సులో ఓ వ్యక్తికి చెందిన రూ.లక్ష పడిపోయాయి. ఆ డబ్బు బస్సు డ్రైవర్ మహేష్ కు దొరికాయి. నిజాయితీతో నిస్వార్ధంగా వ్యవహరించిన మహేష్ ఆ డబ్బును పర్సులోని వివరాల ప్రకారం బాధితులకు అందించారు. రూ.100 దొరికితేనే గప్ చిప్ గా ఎవరికీ తెలియకుండా దాచుకునే ఈ రోజుల్లో డ్రైవర్ మహేష్ నిజాయితీ, నిబద్ధతను గుర్తించిన ఆర్టీసీ అధికారులు ఆయనకు రాష్ట్ర ఆర్టీసీసేవా రివార్డు ప్రకటించారు. హైదరాబాదులోని ఆర్టీసీ భవన్ లో గురువారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా మహేష్ కు ఆ రివార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డ్రైవర్ మహేష్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.