Divitimedia
Crime NewsHealthHyderabadKhammamLife StyleNalgondaPoliticsSpot NewsSuryapetTelanganaYouth

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి

✍️ సూర్యాపేట – దివిటీ (జూన్ 23)

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఖమ్మంజిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం కూసుమంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలకేంద్రంలో ఓ కారుని ప్రమాదవశాత్తు బైక్ ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనను గమనించిన మంత్రి పొంగులేటి హుటాహుటిన తన కాన్వాయిని ఆపి తన కాన్వాయిలోని ఓ వాహనంలో క్షతగాత్రున్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ప్రజలు, క్షతగాత్రుని కుటుంబసభ్యులు ఈ సందర్భంగా మానవత్వంతో స్పందించిన మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పోలీసుస్టేషన్ పరిశీలించిన జిల్లా ఎస్పీ

Divitimedia

పోలీసులమంటూ బెదిరించి డబ్బుల కోసం దాడి

Divitimedia

‘ఐసీడీఎస్’ నిర్లక్ష్యం… ఎమ్మెల్యే ఆగ్రహం…

Divitimedia

Leave a Comment