Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleNalgondaSportsTelanganaYouth

గుండాలలో అక్టోబరు 13నుంచి గిరిజన గురుకుల జోనల్ క్రీడలు

గుండాలలో అక్టోబరు 13నుంచి గిరిజన గురుకుల జోనల్ క్రీడలు

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి 700 మంది క్రీడాకారులు

ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న నిర్వాహకులు, కలెక్టర్, ఐటీడీఏ పీఓకు ఆహ్వానం

✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం

గిరిజన గురుకుల విద్యాలయాల ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలస్థాయి 7వ జోనల్ గేమ్స్, స్పోర్ట్స్ మీట్ అక్టోబరు 13నుంచి గుండాలలోని గిరిజన గురుకుల విద్యాసంస్థ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు బాలురకు నిర్వహించనున్న ఈ క్రీడా పోటీల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధి నుంచి దాదాపు 700మంది పాల్గొనబోతున్నారు. ఈ క్రీడాపోటీల కోసం నిర్వాహకులు మైదానాన్ని సిద్ధం చేయడం, క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు గుండాలలో నిర్వహించనున్న ఈ గురుకుల జోనల్ క్రీడలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐటిడిఏ ఏపీఓ(జనరల్), గిరిజన గురుకుల ప్రాంతీయ సమన్వయాధికారి హెచ్ డేవిడ్ రాజ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈపోటీల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని గిరిజన గురుకులాలకు చెందిన 18 పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొననున్నారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు డేవిడ్ రాజ్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ డా ప్రియాంకఅల, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ లకు ఈ క్రీడాపోటీల ఆహ్వానపత్రికలు అంద జేశారు. ఈ కార్యక్రమంలో గుండాల గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ గుగులోతు హరికృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ విప్పా సత్యనారాయణ, అర్థశాస్త్ర అధ్యాపకుడు ఎ రామచంద్రరావు తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

Divitimedia

ఇల్లందులో టీఎస్ఆర్టీసీ కొత్త డిపో ప్రారంభం

Divitimedia

మూడు గంటలు ప్రచారం… మూడు నిమిషాల గ్రామసభ…

Divitimedia

Leave a Comment