Divitimedia
Bhadradri KothagudemLife StyleTelangana

ఏజెన్సీ చట్టాలపై అవగాహన కార్యక్రమానికి హాజరు కావాలి

ఏజెన్సీ చట్టాలపై అవగాహన కార్యక్రమానికి హాజరు కావాలి

✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం

ఏజెన్సీప్రాంతంలో అమలులో ఉన్న చట్టాల గురించి అక్టోబరు 7వ తేదీన భద్రాచలంలో ఐటీడీఏ ఆవరణలోని ‘గిరిజన భవన్’ లో నిర్వహించనున్న అవగాహన కార్యక్రమానికి సంబంధిత అధికారులు, ఉద్యోగులు తప్పక హాజరు కావాలని ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్ఓఎఫ్ఆర్, ఎల్టీఆర్, పిసా, తదితర చట్టాలపై అందరికీ అవగాహనకు నిర్వహిస్తున్న సమావేశంలో జిల్లా డీఆర్డీఓ, డీపీఓ, సహకార అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, పిసా వైస్ ప్రెసిడెంట్స్ , సెక్రటరీలు, మొబలైజర్స్ పాల్గొనాలని పీఓ కోరారు. 7వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో చట్టాల పట్ల విశేషమైన అనుభవమున్న సీనియర్ న్యాయవాది త్రినాధరావు ఆర్వోఎఫ్ఆర్, ఎల్టీఆర్, పిసా చట్టాలపై అమూల్యమైన న్యాయసలహాలు, సూచనలు అందిస్తారని ఆయన తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని మండలాల అధికారులు, ఉద్యోగులు వారి మండలాల నుంచి ప్రతినిధులందరూ ఈ అవగాహన సదస్సులో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని పీఓ పేర్కొన్నారు.

Related posts

‘రాజీవ్ యువవికాసం’ కార్యక్రమం ప్రారంభించిన సీఎం

Divitimedia

జిల్లాలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ స్పెషల్ డ్రైవ్

Divitimedia

తెలంగాణలో ఉన్నతాధికారిపై కొరడా ఝులిపించిన ఎలక్షన్ కమిషన్

Divitimedia

Leave a Comment