Divitimedia
Bhadradri KothagudemEducationTechnologyTelangana

ఐటీసీ-ప్రథమ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు

ఐటీసీ-ప్రథమ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు, భద్రాచలం

భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లోని 20 ప్రభుత్వపాఠశాలల ఉపాధ్యాయులకు ఇ- ఎడ్యుకేషన్ (కంప్యూటర్ విద్యాబోధన)పై శనివారం బూర్గంపాడు, భద్రాచలంలలో అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్ విద్య నేర్పించడమే లక్యంగా ప్రథమ్ ఇన్ఫోటెక్ ఫౌండేషన్, ఎస్ఏపీ, ఐటీసీ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విద్యా బోధన చేసే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 గురించి కూడా అవగాహన కల్పించారు. 20ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి, కంప్యూటర్ విద్య విద్యార్థులకందించే ఏర్పాట్లు చేసిన ప్రథమ్ ఇన్ఫోటెక్, ఎస్ఏపీ, ఐటీసీ సంస్థలకు ప్రధానోపాధ్యాయులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలో ఆపరేషనల్ లీడర్ లోకరాజు ప్రోగ్రాం కోఆర్డినేటర్ నవీన్, టీం లీడర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

Divitimedia

చ‌త్తీస్‌గ‌ఢ్, తెలంగాణాల‌లో అక్టోబ‌ర్ 3న ప్ర‌ధానమంత్రి ప‌ర్య‌టన

Divitimedia

ఆహ్వానించేందుకు వచ్చానన్న కేఏ పాల్, అనుమతి లేదన్న పోలీసులు

Diviti Media News

Leave a Comment