Divitimedia
Bhadradri KothagudemTechnologyTelangana

వీఆర్ఏలకు ‘మిషన్ భగీరథ సహాయకులు’గా శిక్షణ

వీఆర్ఏలకు ‘మిషన్ భగీరథ సహాయకులు’గా శిక్షణ

✍🏽 దివిటీ మీడియా – పాల్వంచ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెంలోని నీటి శుద్ధి కేంద్రం (వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్)లో రెవెన్యూ శాఖ నుంచి బదిలీపై వచ్చి విధుల్లో చేరిన వీఆర్ఏలకు “మిషన్ భగీరథ విభాగంలో సహాయకులు”గా పనిచేసే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరికి మిషన్ భగీరథలో నిర్వహించాల్సిన విధులు, నీటిని శుద్దిచేసే ప్రక్రియ, వాటర్ ట్యాంక్ కి బ్లీచింగ్ చేసే విధానాల గురించి క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సి.ఇ వి. శ్రీనివాస్, ఎస్.ఇ ఇ.సదాశివ కుమార్, ఇ.ఇ లు ఎన్ తిరుమలేష్, సి నళిని, మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా విభాగాల నుంచి డి.ఇ లు, ఎ.ఇ లు, నీటి నాణ్యత ప్రయోగశాల కన్సల్టెంట్, లాబ్ సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

భారీవర్షాల నేపధ్యంలో కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి తుమ్మల

Divitimedia

స్పోర్ట్స్ స్కూల్ రాష్ట్రస్థాయి పోటీలకు 24మంది ఎంపిక

Divitimedia

దివ్యాంగుల స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

Divitimedia

Leave a Comment