Divitimedia
Andhra PradeshPolitics

 తాగి బండి నడిపితే ఇంక అంతే సంగతులు

విజయవాడ నగరంలో మందు తాగి మత్తులోనే వాహనాలు నడుపుతున్న 49 మందికి కోర్టులు ఏకంగా జైలు శిక్షతోపాటు అదనంగా జరిమానా కూడా విధించారు. ఈ మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వివరాలు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. విజయవాడ నగర పోలీసు కమీషనర్ క్రాంతిరాణా టాటా ఆదేశాలతో నగరంలో వివిధ ప్రదేశాలలో పోలీసులు, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు శుక్రవారం ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించారు. 2వ, 3వ, 4వ పట్టణ ట్రాఫిక్ పోలీసులు మొత్తం 49 కేసులను నమోదు చేశారు. ఈ కేసులలో పట్టుబడిన నిందితులను సంబంధిత న్యాయస్థానాలలో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం వారు జైలు శిక్షలతోపాటు జరిమానా కూడా విధించారు. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

Related posts

కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్న అసంతృప్త నేతలు

Divitimedia

అసెంబ్లీ ఎన్నికల్లోపు ఓటర్లకు చివరి అవకాశం

Divitimedia

కూనేటి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

Divitimedia

Leave a Comment