Divitimedia
BusinessCrime NewsDELHIEducationHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTelanganaYouth

రాష్ట్ర రాజధానిలో రాజకీయ వేడి

రాష్ట్ర రాజధానిలో రాజకీయ వేడి

భూముల పరిశీలనకు హైదరాబాదు చేరిన సుప్రీం కమిటీ

✍️ హైదరాబాదు – దివిటీ (ఏప్రిల్ 10)

హైదరాబాదు కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల వ్యవహారంలో క్షేత్ర స్థాయి పరిశీలన కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ గురువారం హైదరాబాదు చేరుకుంది. ఈ భూముల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల హెచ్ సి.యు (హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ) విద్యార్థి వర్గాల నిరసన, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ భూముల్లో పర్యావరణ హాని జరుగుతోందంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు సహా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో విషయం దేశ అత్యున్నత న్యాయస్థానం వద్దకు చేరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలను తక్షణం నిలిపివేయాలంటూ ఆదేశించిన సుప్రీంకోర్టు, ఈ వ్యవహారం పరిశీలనకు కమిటీని ఏర్పాటుచేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలనే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఈ ప్రత్యేక కమిటీ చర్యలు ఆరంభించింది. క్షేత్రస్థాయి పరిస్థితులు అధ్యయనం చేసేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ సాధికారిక కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, మరో ముగ్గురు సభ్యుల కమిటీ బుధవారం సాయంత్రం 7-45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాదు వచ్చింది. గురువారం కమిటీ గచ్చిబౌలి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ, కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, పరిస్థితులు అధ్యయనం చేసి, ఆ తర్వాత ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భూములపై అవాస్తవాలు ప్రచారం చేశారంటూ ప్రభుత్వం కొందరు వ్యక్తులు, రాజకీయనాయకులపై కేసులు నమోదు చేసిన విషయం విదితమే. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన కమిటీ పర్యటన పట్ల అధికార, ప్రతిపక్ష పార్టీలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Related posts

బ్రిలియంట్ లో అబ్బురపరిచిన బతుకమ్మ సంబరాలు

Divitimedia

జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి

Divitimedia

ఐటీసీలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా

Divitimedia

Leave a Comment