కిలారు కుటుంబంచే శీతల శవపేటిక వితరణ
✍️ పినపాకపట్టీనగర్ – దివిటీ(మార్చి 4)
పినపాకపట్టినగర్ గ్రామ ప్రజల కోసం ఆ గ్రామ వాస్తవ్యులు, ఎన్ఆర్ఐ Dr. కిలారు రాజశేఖర్, తన తాత, అమ్మమ్మ దివంగత స్వతంత్ర సమరయోధులు కాపా వెంకటేశ్వర్రావు- రాములమ్మచౌదరి గార్ల జ్ఞాపకార్ధం శీతల శవపేటికను మంగళవారం ఉచితసేవగా గ్రామ పంచాయితీ కార్యాలయానికి విరాళంగా అందజేశారు. ఎన్ఆర్ఐగా ఉన్న రాజశేఖర్ తమ సేవాసంస్థ కిలారు ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల ఎంపీడీఓ జమలారెడ్డి, గ్రామ సెక్రటరీ, ట్రస్ట్ ప్రతినిధులు కిలారు బోస్, కాపా ప్రభావతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.