Divitimedia
Bhadradri KothagudemLife StylePoliticsSpot NewsTelanganaWomen

సావిత్రిబాయి పూలేకి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయం

సావిత్రిబాయి పూలేకి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయం

✍️ మణుగూరు – దివిటీ (జనవరి 3)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ లో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ నాయకులతోపాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు,స్త్రీ సాధికారతకోసం విశేషంగా కృషిచేసిన సంఘ సంస్కర్త సావిత్రిబాయిపూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షుడు పిరినకి నవీన్, పార్టీ మణుగూరు, అశ్వాపురం మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

భూమాత మాడ్యూల్లో సమస్యలు, పరిష్కారాలపై నివేదించాలి

Divitimedia

‘అగ్నివీర్’ ఎంపికలకు దరఖాస్తు చేసుకోండి

Divitimedia

అమరారం గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే సమీక్ష

Divitimedia

Leave a Comment