Divitimedia
HanamakondaHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTelanganaTravel And TourismWarangal

కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

✍️ వరంగల్ – దివిటీ (నవంబరు 19)

వరంగల్ నగరంలో నిర్మించిన కాళోజీకళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రజలకు అంకితం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆ కళాక్షేత్రానికి ప్రారంభోత్సవం చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని సీఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు జీవిత విశేషాలతో కూడిన ఫోటో గ్యాలరీని, అక్కడ తొలిప్రదర్శనగా వారి జీవితంలోని ఘట్టాలను గుర్తుచేస్తూ రూపొందించిన లఘుచిత్రాన్ని వీక్షించారు. డిజిటల్ పద్ధతిలో అక్కడి నుంచే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన ఏఎస్పీ పరితోష్ పంకజ్

Divitimedia

విద్యార్థులు ‘ఎ’, ‘బి’ గ్రేడ్స్ సాధించేలా కృషి చేయాలి

Divitimedia

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ జన్మదిన వేడుకలు

Divitimedia

Leave a Comment