Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsYouth

రెసిడెన్షియల్ స్కూలులో దీపావళి జరిపిన ఎంఈఓ

రెసిడెన్షియల్ స్కూలులో దీపావళి జరిపిన ఎంఈఓ

✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 1)

పాత కొత్తగూడెంలో ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించే అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులతో తమ కుటుంబసభ్యులతో కలిసి కొత్తగూడెం ఎంఈఓ డాక్టర్. ప్రభుదయాల్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ పాఠశాలలో నిరుపేద పిల్లలు, వీధిబాలురు, పాక్షికంగా అనాథలైన, బడి మానేసి బయట తిరుగుతున్న బాలల కోసం రెసిడెన్షియల్ బోధన చేస్తున్నారు. ఆ చిన్నారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతున్న ఈ పాఠశాలలో దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలలకు స్వీట్లు, సబ్బులు పంపిణీ చేసిన అనంతరం మండల విద్యాశాఖాధికారి ప్రభుదయాల్ కుటుంబ సభ్యులు వారితో కలిసి బాణసంచా కాల్చి దీపావళి సంబరంగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని ఆస్వాదించిన విద్యార్థులు ఆనందపడ్డారు.

Related posts

సంస్కృతి, సంప్రదాయాలు పాటించడంలో గిరిజనులు ఆదర్శం

Divitimedia

ఆర్థిక అవగాహన, లక్ష్యాలతో ముందుకెళ్లాలి

Divitimedia

బాధ్యతలు స్వీకరించిన ఓఎస్డీ, భద్రాచలం ఏఎస్పీ

Divitimedia

Leave a Comment