కృష్ణసాగర్ లో మొక్కలు నాటిన కలెక్టర్

✍️ పాల్వంచ, బూర్గంపాడు – దివిటీ (సెప్టెంబరు 17)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ గ్రామపంచాయతీ, పాల్వంచ మండలం బిక్కుతండా గ్రామపంచాయతీలలో ‘అమ్మ పేరున ఒక చెట్టు నాటుదాం’ అనే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. జిల్లాలో ప్రజలందరూ అదే స్ఫూర్తితో తమ తమ గ్రామాల్లో ఔషధమొక్కలు, పూలమొక్కలు, పర్యావరణాన్ని రక్షించే మొక్కలు విరివిగా నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, స్థానిక అధికారులు పాల్గొన్నారు.