Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationHealthLife StyleNational NewsTelanganaYouth

ఆపరేషన్ ముస్కాన్-10 ద్వారా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన

ఆపరేషన్ ముస్కాన్-10 ద్వారా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన

జిల్లాలో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు : ఎస్పీ రోహిత్ రాజు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 1)

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ -10 జులై1 నుంచి 31వరకు నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పరిశ్రమలు, వ్యాపార సముదాయాలలో బాల కార్మికుల విముక్తి కోసం దాడులు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రత్యేక బృందాలను ఈ దాడులు నిర్వహించడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ దాడులలో భాగంగా బాలకార్మికులను గుర్తించి వారికి విముక్తి కలిగిస్తామని ఆయన తెలిపారు. బాలబాలికలను పనిలో పెట్టుకున్న యాజమానులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్-10 బృందాలు గుర్తించిన చిన్నారులను వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగిస్తామని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అనాధ పిల్లలను సంరక్షణ గృహాలకు తరలిస్తామని తెలియజేశారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనబడితే వెంటనే డయల్-100 కి కానీ 1098కి కానీ ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ ముస్కాన్ -10 ద్వారా జిల్లాలో బాలకార్మికులను గుర్తించి, వారిని సంరక్షించడమే ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు తెలియజేశారు.

Related posts

అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

అంగన్వాడీ కేంద్రం మూసివేతపై ‘డీడబ్ల్యుఓ’ విచారణ

Divitimedia

గంజాయిని అరికట్టడంలో జిల్లా పోలీసుల పనితీరు భేష్

Divitimedia

Leave a Comment