రేపు కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి పర్యటన
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ మీడియా (జూన్ 10)
తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో సోమవారం పేర్కొంది. హైదరాబాదు నుంచి మంగళవారం 11గంటలకు రానున్న మంత్రి పొంగులేటి ఐడీఓసీ (జిల్లా కలెక్టర్ కార్యాలయం)లో అధికారులతో ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మంత్రి ఖమ్మం వెళ్లనున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం అందించారు.