మాదిగల జనసభ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి
✍️ దివిటీ మీడియా – హైదరాబాదు (జూన్ 5)
మాదిగల జనసభ పోస్టర్లను రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి.శ్రీనివాసరెడ్డి హైదరాబాదులోని తన నివాసంలో బుధవారం ఆవిష్కరించారు. మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ తొలి చైర్మన్ డా.పిడమర్తి రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిడమర్తి.రవి మాట్లాడారు. మాదిగలకు 12శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో జూన్ 7 నుంచి జరుగుతున్న మాదిగల జనసభలను జయప్రదం చేయాలని మాదిగ జేఏసీ, అనుబంధసంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులను కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వక్కలగడ్డ చంద్రశేఖర్, మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డే యాదయ్య, డా.బి.ఆర్.అంబేద్కర్ సంక్షేమసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జెల్లి మల్లిఖార్జున్, తదితరులు పాల్గొన్నారు.