Divitimedia
Bhadradri KothagudemHyderabadKhammamLife StylePoliticsSpot NewsTechnologyTelangana

సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి : తుమ్మల

సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి : తుమ్మల

పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

✍🏽 దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (జనవరి 3)

సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేస్తున్న టన్నెల్ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ, సహాకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ మేరకు బుధవారం దమ్మపేట మండలం గండుగులపల్లి వద్ద 4వ పంప్ హౌస్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రూ.13,500 కోట్ల అంచనాలతో చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు రూ.7,000 కోట్లు ఖర్చు జరిగినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన 3 పంప్ హౌస్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ఈ సీజన్ లో 4వ పంప్ హౌస్ పనులు కూడా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. టన్నెల్స్ నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని, వేగం పెంచేందుకు కావాల్సిన సాంకేతికతను వినియోగించి పనుల్లో వేగం పెంచాలని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. యాతాలకుంట టన్నెల్ నిర్మాణం పూర్తి చేయడం వల్ల సత్తుపల్లి ట్రంక్ కెనాల్ కు, లంకాసాగర్ ప్రాజెక్టుకు నీరు అందించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న భూసేకరణ, అటవీ భూముల సేకరణ, టన్నెల్ నిర్మాణ పనులతో పాటు జెన్కో పవర్ హౌస్ టెండరు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సంవత్సరం వర్షాకాలం వరకల్లా వైరా నుంచి కింది భాగం వరకు గోదావరి జలాలనందించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. దీనివల్ల నాగార్జునసాగర్ నుంచి నీరు విడుదల కాని పక్షంలో పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, అందుకే ఈ ప్రాధాన్యత పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. వైరా రిజర్వాయర్ కు లింకు కెనాల్ పనులు పూర్తి చేయాలని, దీనివల్ల ఈ ఏడాదిలోనే వైరా రిజర్వాయర్ కు గోదావరి నీరు అందించడానికి అవకాశం ఏర్పడుతుందని మంత్రి తుమ్మల వివరించారు. ప్రాజెక్టుకు ఇంకో టన్నెల్ నిర్మించాల్సి ఉన్నందున ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. టన్నెల్ పూర్తయితేనే పాలేరు రిజర్వాయర్ కు నీరు వస్తాయని చెప్పారు. సీతమ్మసాగర్ పవర్ హౌస్ కు కావాల్సిన అనుమతులు, 3వ టన్నెల్ నిర్మాణానికి అనుమతితోపాటు అక్కడ ఉన్న అటవీభూములకు అనుమతుల క్లియరెన్సు కోసం ప్రతిపాదనలు సిద్దం చేయాలని మంత్రి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ప్రధానంగా అతి కొద్ది ఖర్చుతో వైరా రిజర్వాయర్ కు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో అన్ని సమస్యలను ప్రభుత్వం క్లియర్ చేస్తుందని చెప్పారు. ఈ సంవత్సరం 1.50 లక్షల ఎకరాలకు, రానున్న సంవత్సరం 1.50 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని చెప్పారు. వర్షాకాలంలో పనులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆ మేరకు పనులు పూర్తి చేయాలనిఆదేశించారు. దానివల్ల వర్షాలు వచ్చినా పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు సమీప గ్రామాలు ముంపునకు గురికాకుండా ఇరువైపులా రక్షణగోడలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రక్షణ గోడల నిర్మాణం వల్ల గోదావరి వరద 63 అడుగుల వరకు వచ్చినా ఎలాంటి ముంపు సమస్య ఉండదన్నారు. 6.74 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం వల్ల అన్ని మీడియం ప్రాజెక్టులకు నీరందిస్తామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు డాక్టర్ ప్రియాంకఅల, వి.పి గౌతమ్, సీఈ శ్రీనివాసరెడ్డి, ఎస్ఈలు వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఈఈలు అర్జున్, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సాగు చేస్తున్నవారికే రైతు భరోసా అందించాలన్న రైతులు

Divitimedia

కలెక్టర్ ఆదేశిస్తే తప్ప కదలరన్నమాట…?

Divitimedia

పాఠశాలను తనిఖీ చేసిన కేంద్రప్రభుత్వ ప్రతినిధి

Divitimedia

Leave a Comment