హైదరాబాదులో 20న ‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అవేర్ నెస్ డ్రైవ్’
ఐఐటీ-ఖరగ్ పూర్’ ఆధ్వర్యంలో వర్థమాన్ ఇంజినీరింగ్ కాలేజీ వేదిక
✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు
ఐఐటీ-ఖరగ్ పూర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల (అక్టోబరు) 20న ‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అవేర్ నెస్ డ్రైవ్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐఐటీ- ఖరగ్ పూర్ విద్యార్థులు మానస వేములపల్లి, అర్జున్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ప్రత్యేక కార్యక్రమం వర్థమాన్ ఇంజినీరింగ్ కాలేజీ వేదికగా జరుగనుంది. విద్యార్థుల్లో ‘స్టార్టప్’ కల్చర్ పెంపొందించడానికి, ఔత్సాహికులు, స్టార్టప్స్ ప్రతినిధులు పాల్గొననున్న ప్రత్యేక కార్యక్రమంలో అతిథుల ప్రసంగాలు, కీనోట్ సెషన్స్, మెంటారింగ్, నెట్ వర్కింగ్ సెషన్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సైయెంట్ సంస్థ వ్యవస్థాపకులు బి.వి.ఆర్ మోహన్ రెడ్డి, నెక్స్ట్ వేవ్ సంస్థ సహ వ్యవస్థాపకులు రాహుల్ అట్లూరి, స్కిప్పి సంస్థ వ్యవస్థాపకులు రవి కాబ్రా అతిథులు హాజరు కానున్నట్లు నిర్వాహకులు మానస, అర్జున్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఫిన్ వెస్టా, ఒడ్డొ సంస్థలు స్పాన్సరర్లుగా, ది హిందూ జాతీయ మీడియా పార్టనర్ గా సహకారం అందిస్తున్నారు. అక్టోబరు 20న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నిర్వహించనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఔత్సాహికులు రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు మానస వేములపల్లి, అర్జున్ కోరారు. VEMULAPALLI MAANASA – 8074290551, email-vemulapalli.maanasa@ecell-iitkgp.org , ARJUN REDDY – 8340974675, email- arjun.reddy@ecell-iitkgp.org