Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleTelangana

సత్ప్రవర్తనతో మెలగకుంటే కఠిన చర్యలు తప్పవు

సత్ప్రవర్తనతో మెలగకుంటే కఠిన చర్యలు తప్పవు

రౌడీషీటర్లకు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ కౌన్సెలింగ్

✍🏽 దివిటీ మీడియా – చర్ల, భద్రాచలం

రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ నేరాలకు పాల్పడితే జైలుజీవితం తప్పదని భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. బుధవారం ఆయన చర్ల పోలీసుస్టేషన్ ఆవరణలో ఆ మండలంలోని రౌడీషీటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సమాజంలో గౌరవప్రదంగా మెలగాలని, తద్వారా మంచివారిగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు అనుభవించాల్సి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇకనుంచి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండి సమాజంలో సముచితస్థానంలో నిలిచేలా గౌరవప్రదంగా మెలగాలని ఆయన హితవు పలికారు. ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, చట్టపరంగా జైలు జీవితం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ బి.రాజగోపాల్, ఎస్సైలు టీవీఆర్ సూరి, వెంకటప్పయ్య, నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెండింగ్ శాలరీ బిల్లు చేయడానికి రూ.10వేలు లంచం

Divitimedia

సారపాకలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

Divitimedia

ప్రాథమిక పాఠశాలను సందర్శించిన క్లస్టర్ నోడల్ అధికారి

Divitimedia

Leave a Comment