చత్తీస్గఢ్, తెలంగాణాలలో అక్టోబర్ 3న ప్రధానమంత్రి పర్యటన
నాగర్నార్ వద్ద ఎన్.ఎం.డి.సి స్టీల్ ప్లాంట్ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని
తెలంగాణలో రూ. 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు, న్యూఢిల్లీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 3వ తేదీన(మంగళవారం) చత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఛత్తీస్గఢ్లో రూ.26,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బస్తర్ జిల్లాలోని నాగర్నార్ దగ్గర రూ.23,800 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఎన్.ఎం.డి.సి స్టీల్ ప్లాంట్ను ఈ సందర్భంగా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణలోని నిజామాబాద్కు చేరుకుని విద్యుత్, రైల్వే, ఆరోగ్య రంగాల్లో దాదాపు రూ.8000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. మెరుగైన ఇంధన సామర్థ్యంతో విద్యుత్తు ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో ఎన్.టి.పి.సి ఆధ్వర్యంలో 800మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, రామగుండం మొదటి దశ యూనిట్ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణకు తక్కువ ధరకే విద్యుత్తునందించడంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే దేశంలోని అత్యంత పర్యావరణ అనుకూలమైన పవర్ స్టేషన్లలో ఇది ఒకటని చెప్తున్నారు.
ఈ సందర్భంగా మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య కొత్త రైల్వేలైన్తో సహా జాతీయ రైలు ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. ధర్మాబాద్ – మనోహరాబాద్, మహబూబ్ నగర్-కర్నూల్ మధ్య 76 కిలోమీటర్ల ఈ విద్యుద్దీకరణతో మనోహరాబాద్-సిద్దిపేట రైలు మార్గం ఈ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్తున్నారు.ఈ విద్యుద్దీకరణ ప్రాజెక్ట్ రైళ్ల సగటువేగం మెరుగుపరచడంలో సహాయపడుతుందని, పర్యావరణహిత ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని సిద్దిపేట-సికింద్రాబాద్ మధ్య రైలు సర్వీసును కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించే ప్రాజెక్టులో భాగంగా మొత్తం 20 క్రిటికల్ కేర్ బ్లాకుల అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫ్రా స్ట్రక్షర్ మిషన్ కింద ఈ క్రిటికల్ కేర్ బ్లాకులను అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల,హైదరాబాదు, ఖమ్మం, మహబూబ్ నగర్(బడేపల్లి), ములుగు, వికారాబాద్, వరంగల్(నర్సంపేట), కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట,
నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి (మహేశ్వరం, సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాల్లో అభివృద్ధి చేయనున్నారు.