రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతను ప్రశంసించిన కలెక్టర్
✍️ కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 13)
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికైన కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్.ఎం. డాక్టర్ ప్రభుదయాల్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం ప్రశంశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ మేరకు ప్రభుదయాళ్ ను కలెక్టర్ సత్కరించారు. విద్యారంగంలో ఆయన చేసిన, చేస్తున్న కృషిని అభినందించారు. మరిన్ని శిఖరాలందుకోవాలని, మరింత గుర్తింపు పొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు.