శ్రీసత్యసాయి స్కూల్ విద్యార్థులకు ఐటీసీ రోటరీ ఇన్భద్రా వితరణ

✍ దివిటీ మీడియా – బూర్గంపాడు, ఫిబ్రవరి 29
సారపాలోని ఐటీసీ అనుబంధ సంస్థ రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా ఆధ్వర్యంలో గురువారం స్ధానిక గాంధీనగర్ లో శ్రీసత్యసాయి స్కూల్ విద్యార్థులకు రూ.1లక్ష విలువచేసే సామగ్రి బహూకరించారు. ఈ మేరకు ఒక్కొక్క విద్యార్థికీ రెండు జతల స్కూల్ యూనిఫాం, మంచినీటి గ్లాసులు ఉచితంగా అంద జేశారు. ఈ కార్య్రమానికి ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్, ఐటీసీ హెచ్.ఆర్ హెడ్ శ్యాంకిరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ జయంత్ కుమార్ దాస్ మాట్లాడుతూ, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీసత్యసాయి స్కూల్ యాజమాన్యం ఐటీసీ రోటరీ ఇన్ భద్రా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రెటరీ కేవీఎస్ గోవిందరావు, ప్రతినిధులు చెంగలరావు, శివరాంకృష్ణన్, ప్రఫుల్ల, నాగమల్లేశ్వరరావు, ప్రతాప్, సాయిరాం, చాంద్ బాషా, మరడన శ్రీనివాసరావు, ఏసోబు, బసప్ప రమేష్, సత్యనారాయణ, సుధాకర్ రెడ్డి, రోటరాక్ట్ క్లబ్ సభ్యులు నీలి మురళి, స్నేహ, భార్గవి, తదితరులు పాల్గొన్నారు.