బీఎస్ఎన్ఎల్ టవర్స్ నిర్మాణానికి భూమి కేటాయింపుపై కలెక్టర్ హామీ

✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
బీఎస్ఎన్ఎల్ ద్వారా జిల్లాలో సెల్ సిగ్నల్ కవరేజ్ లేని 32 గ్రామాలలో బీఎస్ఎన్ఎల్ 4జీ సెల్ టవర్స్ నిర్మించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఐడీఓసీలో ఆమె బీఎస్ఎన్ఎల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నెట్ వర్క్ లేని గ్రామాల్లో సెల్ టవర్ల నిర్మాణానికి గుర్తించిన గ్రామాల్లో 2 గుంటల భూమి టవర్స్ నిర్మించేందుకు కేటాయించాలని కలెక్టర్ ను బీఎస్ఎన్ఎల్ అధికారులు కోరారు. ఈ రోజుల్లో సెల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలు ప్రజలకు అవసరమని, ప్రభుత్వసేవలు పొందేందుకున్న ప్రాధాన్యత బట్టి టవర్లనిర్మాణానికి భూమి కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ జిల్లాలో 26 గ్రామాల్లో రెవిన్యూ అధీనంలోని 2 గుంటల భూమిని కేటాయిస్తామని, మరో 6 గ్రామాలు వ్యవసాయశాఖ పరిధిలో ఉండడం వల్ల వ్యవసాయ అధికారులతో మాట్లాడి త్వరలో భూమి కేటాయింపునకు చర్యలు తీసుకుంటామనని చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం.వి.రవీంద్రనాధ్,
బీఎస్ఎన్ఎల్ డీజీఎం నవీన, ఏజీఎం శ్రీనివాసరావు, ఎస్డీఈ సుధీర్, తదితరులు పాల్గొన్నారు.